AP Excise Policy: ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు.. వారికి పండగే
ABN , Publish Date - Jan 13 , 2026 | 03:11 PM
ఏపీలో బార్ల వ్యాపారులకు పెద్ద ఊరట లభించింది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ను పూర్తిగా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, జనవరి 13: ఏపీ ఎక్సైజ్ పాలసీలో(AP Excise Policy) రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) పలు ముఖ్యమైన మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ARET)ను పూర్తిగా రద్దు చేసింది. 2019 నవంబర్ నుంచి బార్లపై ఉన్న ప్రత్యేక ARETని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు మంగళవారం.. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.. జీఓ ఎంఎస్ నంబర్ 24ను జారీ చేశారు.
ప్రధాన మార్పులు ఇవే..
ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు ధరలు ఉండవు. ధరల్లో సమానత్వం పునరుద్ధరణ.
ఏపీఎస్బీసీఎల్(APSBCL) డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల్(IMFL), ఎఫ్ఎల్(FL)పై అదనపు పన్ను విధింపు ఉండకూడదని ఆదేశం.
ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ.
2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలు చేస్తూ నిర్ణయం.
ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు పెద్ద ఊరటగా మారనుంది. ఇలాంటి మార్పులతో బార్ల వ్యాపారులకు గణనీయంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, APSBCL అధికారులు ఈ మార్పుల అమలుకు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచి(2026 జనవరి 13) నుంచి అమలులోకి వస్తాయి. గతంలో బార్లకు రిటైల్ షాపుల కంటే ఎక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుండటం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి తలెత్తేది. ఇప్పుడు ధరల సమానత్వంతో బార్లకు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
వివేకా హత్య కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి వాయిదా..
కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..
Read Latest AP News And Telugu News