అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:38 AM
ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది.
అమరావతి, ఆగస్టు 21: ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది. ఐనవోలులో మొత్తం 2.05 ఎకరాల్లో SBI నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. దాదాపు రూ.214 కోట్లతో SBI హౌసింగ్ ప్రాజెక్ట్ను చేపట్టనున్నారు. 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో నిర్మాణం జరుగనుంది. జూన్, 2027లో నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. 2028లోపు నివాస సముదాయం పూర్తి చేయడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
ఇక, లింగాయపాలెం-ఉద్దండరాయునిపాలెంలో 3 ఎకరాల్లో SBI ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. SBI కార్యాలయానికి గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతిని జాతీయ స్థాయి ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం, ఎస్బీఐ సిబ్బంది నివాస సముదాయ నిర్మాణం మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.
ఇవి కూడా చదవండి...
ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
అన్నవరం బస్టాండ్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు..
Read Latest AP News And Telugu News