Share News

ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Mar 18 , 2026 | 09:12 AM

తిరుపతి ఎమ్మెల్యేల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

అమరావతి, మార్చి 18: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌పై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా..? అంటూ ఈ సమావేశంలో ఆయన ప్రశ్నించారు. బుధవారం ఏలూరు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. యువకుడు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని అతడికి అవకాశమిచ్చామని వివరించారు. కానీ ఆయన ఈ విధంగా వ్యవహరించారన్నారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. టీడీపీలో నాయకులంతా క్రమశిక్షణతో మెలగాల్సిందేనని.. ఎవరికీ వెసులుబాటు ఉండదని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇది జరిగింది..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌పై మార్చి 14వ తేదీ రాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డితోపాటు అతడి సోదరుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా.. పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.


ఆ జాబితాలో పుట్టా మహేశ్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అలాగే పుట్టా మహేశ్ కుమార్‌కు టీడీపీ, పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని వారికి ఆయా పార్టీలు స్పష్టం చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

మళ్లీ పెరిగిన బంగారం ధర..

For More AP News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 10:32 AM