Share News

ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..

ABN , Publish Date - Jul 14 , 2026 | 02:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(SIR) షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) సవరించింది. సర్ గడువును ఈనెల 24 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..
SIR

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(SIR) షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) సవరించింది. సర్ గడువును ఈనెల 24 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2026 జులై 1ను అర్హత తేదీగా నిర్ణయించి సవరణ ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.


సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇదే గడువులో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. అనంతరం జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను (డ్రాఫ్ట్) ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28లోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది.


అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా సవరణలు వంటి ప్రక్రియలు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

పోలవరం పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ముంబై ఆస్పత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం దేవేంద్ర ఫడణవీస్

Updated Date - Jul 14 , 2026 | 02:42 PM