Share News

10, 11న కలెక్టర్ల సదస్సు

ABN , Publish Date - Sep 04 , 2026 | 07:09 AM

రాష్ట్ర ప్రభుత్వం ఐదవ విడత జిల్లా కలెక్టర్ల సదస్సుకు సిద్ధం అయింది. ఈ నెల 10, 11వ తేదీల్లో అమరావతిలోని సచివాలయంలో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది.

10, 11న కలెక్టర్ల సదస్సు

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఐదవ విడత జిల్లా కలెక్టర్ల సదస్సుకు సిద్ధం అయింది. ఈ నెల 10, 11వ తేదీల్లో అమరావతిలోని సచివాలయంలో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు సాధారణ పరిపాలన శాఖ సమాచారం అందించింది. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ 5.0 పేరుతో ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది. రెండు, మూడు రోజుల్లో అజెండాను ప్రభుత్వం ఖరారు చేయనుంది.

ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

Updated Date - Sep 04 , 2026 | 07:10 AM