ఘోరం.. కాకినాడలో పార్శిల్ బ్లాస్ట్

ABN, First Publish Date - 2025-03-03T15:45:32+05:30 IST

parcel explosion: కాకినాడలో ఈరోజు (సోమవారం) జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్‌ను దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

తూర్పుగోదావరి, మార్చి 3: కాకినాడ వార్పురోడ్డులోని ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అవడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్‌‌ను (parcel explosion) దించుతుండగా ఈ ఘటన జరిగింది. ఈరోజు (సోమవారం) ఉదయం బాలాజీ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో నుంచి పార్శిల్స్‌ను దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఐదుగురు కూలీలు గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


పార్శిల్‌ను దించుతున్న కూలీ చేతులు, కాళ్లు కాలిపోయాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్న పిల్లలు గోడకేసి కొట్టగా పేలే టపాసులు ఉన్న పార్శిల్ పేలినట్లు నిర్ధారణకు వచ్చారు. పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఏ ట్రాన్స్‌పోర్టు కంపెనీ పంపింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి

Read Latest AP News And Telugu News

Updated at - 2025-03-03T15:50:20+05:30