పుష్ప2 మూవీలో సుకుమార్‌కు షేర్లు

ABN, Publish Date - Jan 22 , 2025 | 01:17 PM

టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పుష్ప -2 చిత్ర దర్శకుడు సుకుమార్‌కు ఆ సినిమా నిర్మాణంలో షేర్లు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్: పుష్ప -2 చిత్ర దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సుకుమార్‌కు షేర్లు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బుధవారం రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలియ వచ్చింది.

ఈ వార్త కూడా చదవండి..

రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు


ఇప్పటి వరకు నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆయన కుమార్తె హన్సితా రెడ్డి, దిల్ రాజు సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష ఇంట్లో కూడా ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్‌ల ఇళ్లల్లో పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. హన్సితా రెడ్డి, నవీన్ ఇళ్లులు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. ఈ రెండు ఇళ్లల్లో 10 మంది ఐటీ అధికారులు బృందంగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. వచ్చిన లాభాలకు, చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

గన్నవరంలో పలు విమానాలు రద్దు

రామచిలుకలను బంధించిన వ్యక్తి అరెస్టు

దావోస్‌లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన

దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 22 , 2025 | 01:26 PM