కడప జిల్లాలో సజ్జల భూకబ్జాలు
ABN, Publish Date - Jan 02 , 2025 | 12:06 PM
కడప జిల్లా: జగన్ హయాంలో సకల శాఖా మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు. ఎకరా, రెండు ఎకరాలు కాదు ఏకంగా 42 ఎకరాల భూమి ఆక్రమించేశారు. అక్కడ దర్జాగా పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
కడప జిల్లా: జగన్ హయాంలో సకల శాఖా మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు. ఎకరా, రెండు ఎకరాలు కాదు ఏకంగా 42 ఎకరాల భూమి ఆక్రమించేశారు. అక్కడ దర్జాగా పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతేగాక అటవీ భూమిలో గెస్ట్హౌస్లు, పనివారి కోసం షెడ్లు కట్టించారు. సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించారని తెలుస్తోంది. వారంతా ఆయన బినామీలనే ప్రచారం ఉంది.
గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన ఈ అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తరువాత అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకునేవారు. అప్పట్లో సీఎంతో పాటు సీఎస్, డీజీపీ కూడా కడప వాళ్లే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సజ్జల సోదరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా అటవీ భూమినే కబ్జా చేశారు. కాల్వలు, కుంటలు కూడా ఆక్రమించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడిగుడ్డు కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు..
ఏబీఎన్ చేతికి ఆదినారాయణపై దాడి దృశ్యాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..
ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాలకు సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 02 , 2025 | 12:06 PM