తిరుమల సన్నిధిలో సీఎం రేవంత్
ABN, Publish Date - Dec 30 , 2025 | 07:54 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలుమార్లు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఆయన తిరుమల వెళ్లారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల ప్రారంభానికి ముందు అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక పూజ కైంకర్యాలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనాల ప్రారంభం సందర్భంగా ముందుగా ప్రముఖులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని వైకుంఠ ద్వారా గుండా బయటకు వచ్చారు.
ఈ వీడియోలు చూడండి :
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ప్రత్యేక నిఘా
Updated at - Dec 30 , 2025 | 09:20 AM