కర్నూలు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ABN, Publish Date - Oct 24 , 2025 | 11:55 AM
గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో బెంగళూరులో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల రమేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి.. గత రాత్రి ట్రావెల్స్ బస్సులో బెంగుళూరుకు పయనమయ్యాడు.
కర్నూలు, అక్టోబర్ 24: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం (Kurnool Bus Accident) ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తమ వారిని కోల్పోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక నెల్లూరు చెందిన ఓ కుటుంబం కూడా మంటల్లో సజీవదహనం అయ్యింది. జిల్లాలోని గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో బెంగళూరులో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల రమేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి.. గత రాత్రి కావేరి ట్రావెల్స్ బస్సులో బెంగుళూరుకు పయనమయ్యాడు.
కానీ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో రమేష్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో రమేష్ సొంతూరు గోళ్లవారిపాలెంటో విషాదఛాయలు అలముకునున్నాయి.
ఇవి కూడా చదవండి...
కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్
అదే తేలితే చర్యలు తప్పవు.. ప్రైవేట్ ట్రావెల్స్కు సీఎం వార్నింగ్
Read Latest AP News And Telugu News
Updated at - Oct 24 , 2025 | 11:56 AM