Montha Cyclone: ఏపీకి డేంజర్ బెల్స్.. దూసుకొస్తున్న తుపాన్..

ABN, Publish Date - Oct 26 , 2025 | 08:04 AM

ఏపీకి మొంథా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను.. కోస్తాతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాలపై విరుచుకుపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం.. పడమర దిశగా పయనించి శనివరం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.

ఏపీకి మొంథా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను.. కోస్తాతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాలపై విరుచుకుపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం.. పడమర దిశగా పయనించి శనివరం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇక శనివారం సాయంత్రానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది ఇవాళ ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తీవ్ర వాయుగుండంగా, తర్వాత మరింత బలపడి సోమవారం ఉదయానికి తుపానుగా బలపడనుంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Oct 26 , 2025 | 08:04 AM