Helicopter Accident: ఉత్తరాఖండ్లో విషాదం..
ABN , Publish Date - May 08 , 2025 | 02:07 PM
ఉత్తరాఖండ్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలోని గంగా నాని సమీపంలో హెలీకాప్టర్ కూలి ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఉత్తరాఖండ్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలోని గంగా నాని సమీపంలో హెలీకాప్టర్ కూలి ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పర్యాటకులు హెలీకాప్టర్లో గంగోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.