CM Chandrababu: నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి సురవరం..

ABN, Publish Date - Aug 24 , 2025 | 02:01 PM

సీపీఐ అగ్రనేత, నల్గొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హిమాయత్ నగర్‌లోని మఖ్దూమ్ భవన్‌‌కి వెళ్లిన సీఎం చంద్రబాబు.. సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సీపీఐ అగ్రనేత, నల్గొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హిమాయత్ నగర్‌లోని మఖ్దూమ్ భవన్‌‌కి వెళ్లిన సీఎం చంద్రబాబు.. సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సురవరం సేవల్ని గుర్తు చేసుకున్నారు. సుధాకర్ రెడ్డితో తనకు సదీర్ఘ రాజకీయ అనుబంధం ఉందన్నారు. తన జీవితంలో మర్చిపోలేని వ్యక్తి సుధాకర్ రెడ్డి అని సీఎం చంద్రబాబు కొనియాడారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Aug 24 , 2025 | 02:01 PM