ACB: స్పీడ్ పెంచిన ఏసీబీ..! విచారణకు ఎఫ్ఈవో కంపెనీ చైర్మన్..!
ABN, Publish Date - Feb 28 , 2025 | 04:31 PM
ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు విషయంలో ఎఫ్ఈవో కంపెనీ సీఈఓను మొదటిసారిగా ఇవాళ విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈవో కంపెనీ సీఈఓ హాజరు కానున్నారు.
హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు విషయంలో ఎఫ్ఈవో కంపెనీ సీఈఓను మొదటిసారిగా ఇవాళ విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈవో కంపెనీ సీఈఓ హాజరు కానున్నారు. సీఈఓ నుంచి మరింత సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సీఈఓను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారు.
విదేశాల్లో ఎఫ్ఈవో కంపెనీకి సంబంధించిన చైర్మన్, సీఈఓ ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహిస్తున్నారు. 2024లో నిర్వహించాల్సిన ఈ కార్ రేసింగ్ ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి ముందుగా ఎవరూ ప్రతిపాదించారనే అంశాలపై పూర్తి స్థాయిలో ఎఫ్ఈవో కంపెనీ నుంచి రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సీఈఓను విచారించిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్కు ఒకటి రెండు రోజుల్లో రెండో దఫా నోటీసులు పంపించనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేబినెట్..
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం..
వైఎస్సార్సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 28 , 2025 | 04:31 PM