ఫామ్ హౌస్‌లో కోడి పందాలు..64 మంది అరెస్ట్

ABN, Publish Date - Feb 12 , 2025 | 07:05 PM

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మొత్తం 64 మందిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ఓ ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మొత్తం 64 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 53 మంది ఏపీ వాళ్లు అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 84 పందెం కోళ్లను సీజ్ చేశామన్నారు. కోడి పందేల కోసం కోళ్లను అమలాపురం నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ల్యాండ్ ఓనర్లను కూడా ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రాపర్టీ లీజ్‌కు ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, లేదంటే ఇలాంటే సమస్యలే వస్తాయని సూచించారు.

Updated at - Feb 12 , 2025 | 07:08 PM