మరో 2,500 కోట్ల అప్పు తీసుకోనున్న సర్కార్
ABN , Publish Date - May 10 , 2025 | 05:13 AM
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోవడానికి సెక్యూరిటీ బాండ్లను రిలీజ్ చేసింది.

హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోవడానికి సెక్యూరిటీ బాండ్లను రిలీజ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 13న నిర్వహించనున్న ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించనుంది. 21 ఏళ్ల కాల పరిమితితో రూ.800 కోట్లు, 22 ఏళ్ల కాల పరిమితితో రూ.800 కోట్లు, 25 ఏళ్ల కాల పరిమితితో రూ.900 కోట్ల చొప్పున రుణాన్ని సేకరించనుంది. తెలంగాణ సహా దేశంలోని 7 రాష్ట్రాలు రూ.11,500 కోట్ల మేర రుణాలు తీసుకోనున్నాయి.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News