Share News

సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

ABN , Publish Date - Feb 13 , 2025 | 03:35 AM

రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

రాజేంద్రనగర్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. మైలార్‌దేవుపల్లి పల్లెచెరువు నుంచి దుర్గానగర్‌ వరకు ప్లై ఓవర్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. గత ప్రభుత్వ హయాంలో ప్లై ఓవర్‌ నిర్మాణం, ఆరాంఘర్‌ చౌరస్తాలో రెండు రోడ్డు అండర్‌ బ్రిడ్జీల నిర్మాణాలకు రూ.259 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. అయితే.. నిధులు మాత్రం మంజూరు చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - Feb 13 , 2025 | 03:35 AM