Share News

KTR: బాధపడొద్దు.. బాధ్యత తీసుకుంటా

ABN , Publish Date - May 12 , 2025 | 04:28 AM

సౌదీ అరేబియాలో 15 రోజుల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేశ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

KTR: బాధపడొద్దు.. బాధ్యత తీసుకుంటా

  • గల్ఫ్‌ బాధిత కుటుంబానికి కేటీఆర్‌ భరోసా

సిరిసిల్ల/హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): సౌదీ అరేబియాలో 15 రోజుల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేశ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. విష యం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండేపల్లిలో ఉన్న మహేశ్‌ కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించారు. సొంత ఖర్చులతో మహేశ్‌ను భారత్‌కు తీసుకొచ్చి అన్ని విధాలుగానూ ఆదుకుంటానని బాధపడొద్దని భరోసా ఇచ్చారు.


మహేశ్‌తో ఫోన్‌లో మాట్లాడి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. కాగా, ఈ విశ్వంలో అత్యంత గొప్ప ప్రేమను పంచేది తల్లి మాత్రమేనని.. ఎంతో గొప్పవారిని మనకు అందించిన మాతృమూర్తులకు వందనం అంటూ కేటీఆర్‌ ఆదివారం మదర్స్‌ డే సందర్భంగా ఎక్స్‌ వేదికగా.. అమ్మలను అభినందించారు.


ఇవి కూడా చదవండి

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 04:28 AM