Share News

Electric shock: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 08:44 AM

విద్యుత్ శాకకు చెందిన వ్యక్తి 2 కెవి విద్యుత్ టవర్‌పై మరమ్మత్తులు చేస్తుండగా. అదే సమయంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ మరమ్మత్తులు చేస్తున్న సమయంలో విద్యుత్ అధికారులు పవర్ ఆన్ చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.

Electric shock: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో  నిండు ప్రాణం బలి
Electric shock

హైదరాబాద్: విద్యుత్ (Electrical) అధికారుల నిర్లక్ష్యంతో (Officials Claims) ఓ నిండు ప్రాణం బలైంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ (Medchal Police Station) పరిధిలోని కండ్లకోయ గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. యూసఫ్ గూడకు చెందిన కుల్దీప్ సునీల్ (33) అనే వ్యక్తి 22 కెవి విద్యుత్ టవర్‌పై మరమ్మత్తులు చేస్తున్నాడు. అదే సమయంలో విద్యుత్ షాక్ (Electric shock) తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ మరమ్మత్తులు (Repair) చేస్తున్న సమయంలో విద్యుత్ అధికారులు పవర్ ఆన్ చేశారు. విద్యుత్ అధికారులు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read: మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..


కాగా ఇటీవలే కుల్డిప్‌కు పెళ్లి నిశ్చయమైంది. త్వరలోనే వివాహం జరగనుంది. కుల్దీప్ సునీల్ మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకు మేడ్చట్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..

మరోవైపు నల్గొండ జిల్లా, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. యూనిట్-1 బాయిలర్‌లో ఆయిల్ ఫైర్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటలను సకాలంలో అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్లాంట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే నెలలో యూనిట్ - 1ను ప్రారంభించేందుకు అధికారుల ట్రయల్ రన్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రంపై 1.50 లక్షల కోర్టు ధిక్కరణ కేసులు

మోదీ సభకు చకచకా ఏర్పాట్లు

For More AP News and Telugu News

Updated Date - Apr 28 , 2025 | 08:50 AM