Share News

Contempt Cases: కేంద్రంపై 1.50 లక్షల కోర్టు ధిక్కరణ కేసులు

ABN , Publish Date - Apr 28 , 2025 | 05:03 AM

కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, న్యాయశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులపై సకాలంలో స్పందించకపోతే మరింత కేసులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ శాఖలలో కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులకు న్యాయ విద్యలో అవసరమైన అర్హతల లేదని, ఈ కారణంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది.

Contempt Cases: కేంద్రంపై 1.50 లక్షల కోర్టు ధిక్కరణ కేసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతుండడంపై న్యాయశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నివారించాలంటే సకాలంలో కోర్టు ఉత్తర్వులపై స్పందించాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలోని వివిధ కోర్టుల్లో కేంద్రంపై సుమారు 1.50 లక్షల కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలంటూ అన్ని మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. వివిధ శాఖల్లో కోర్టు వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అధికారులకు న్యాయ విద్యలో తగిన అర్హతలు లేకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేస్తే తలెత్తే పరిణామాలపై వారికి అవగాహన ఉండడం లేదని తెలిపింది. ఈ కారణంగానే ఆయా శాఖల అధిపతులపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 05:48 AM