Big Breaking: భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Oct 31 , 2025 | 09:32 PM
భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 17వ తేదీన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం సస్పెండ్ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 31: భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 17వ తేదీన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం సస్పెండ్ చేసింది. నాగారం సర్వే నంబర్ 194, 195ల్లోని బ్యూరోక్రాట్స్ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుపై డివిజన్ బెంచ్లో బ్యూరోక్రాట్స్ ఆపిల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆధారాలను పరిశీలించిన తర్వాత డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. అవి భూదాన్ భూములు కానప్పుడు నిషేధిత జాబితాలో ఎందుకు ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఐఏఎస్, ఐపీఎస్లకు సర్వే నంబర్ 194,195 లోనివి పట్టా భూములేనని జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181,182, 194, 195లలో గల భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతరులు అక్రమంగా పొందారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విచారణ జరపాలంటూ బిర్ల మల్లేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం గత కొద్ది కాలంగా హైకోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో దుర్మార్గమైన పాలన.. మహేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News