Share News

Ganesh Chaturthi: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు

ABN , Publish Date - Aug 27 , 2025 | 08:59 AM

హిందూ సంప్రదాయం ప్రకారం ఏడాదిలో చాలా పండగలే వస్తాయి. కానీ అన్ని పండగల్లో వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

Ganesh Chaturthi: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు

హిందూ సంప్రదాయం ప్రకారం ఏడాదిలో చాలా పండగలే వస్తాయి. కానీ అన్ని పండగల్లో వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండగ.. ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.ఈ ఏడాది వినాయక చవితి.. భాద్ర పద శుక్ల పక్ష చతుర్థి తిథి ఆగస్టు 27వ తేదీన.. అంటే బుధవారం వచ్చింది. ఈ రోజు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఊరు వాడ, ప్రతీ ఇంటా వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకుంటారు. ఈ పూజలో భాగంగా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ మంత్రాలను భక్తులు పఠిస్తారు. తొలి పూజలందుకునే గణనాథుని అనుగ్రహం కోసం భక్తులు.. పత్రి, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలి వెళ్తున్నారు.


పసుపు గణపతి పూజ..

విఘ్నలను తొలగించే వాడే కాదు.. ఏ పూజ కానీ.. ఏ వ్రతం కానీ.. ఏ శుభకార్యం కానీ.. వీటిలో ఏ ఒక్కటి ప్రారంభించాలన్నా.. ముందుగా గణనాథుడిని పూజించాలి. అలాంటి గణపతిని తొలుత పసుపు ముద్దగా చేసి పూజిస్తారు. అనంతరం ఏ పూజ అయిన ప్రారంభిస్తారు.

పూజ ప్రారంభం:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (గణపతిని ధ్యానించాలి)

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా)తో నీళ్లు పట్టుకుని)

అనంతరం అపవిత్ర: పవిత్రోవా

సర్వావస్థాం గతోపివా|

యస్మరేత్ పుండరీకాక్షం

సబాహ్యాభ్యంతరస్శుచి:||

ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ: అనుకోవాలి. (అనంతరం కుడి చేతి బొటన వ్రేలితో.. ఆ ఉద్దరిణెలోని నీటిని తలపై మూడు సార్లు చల్లుకోవాలి)


దీపం

ఓం శ్రీగురుభ్యో నమ:

దీపం వెలిగించి.. గంధ పుష్పాదులతో అలంకరించి..దీపదేవతాభ్యో నమ: అని సమస్కరించుకోవాలి.


ఆచమనం

ఓం కేశవాయ స్వాహా

ఓం నారాయణాయ స్వాహా

ఓం మాధవాయ స్వాహా

కేశవ నామములు

ఓం గోవిందాయ నమ:

ఓం విష్ణవే నమ:

ఓం మధుసూదనాయ నమ:

ఓం త్రివిక్రమాయ నమ:

ఓం వామనాయ నమ:

ఓం శ్రీధరాయ నమ:

ఓం హృషీకేశాయ నమ:

ఓం పద్మనాభాయ నమ:

ఓం దామోదరాయ నమ:

ఓం సంకర్షణాయ నమ:

ఓం వాసుదేవాయ నమ:

ఓం ప్రద్యుమ్నాయ నమ:

ఓం అనిరుద్దాయ నమ:

ఓం పురుషోత్తమాయ నమ:

ఓం అధోక్షజాయ నమ:

ఓం నారసింహాయ నమ:

ఓం అచ్యుతాయ నమ:

ఓం జనార్దనాయ నమ:

ఓం ఉపేంద్రాయ నమ:

ఓం హరయే నమ:

ఓం శ్రీకృష్ణాయ నమ:


భూతోచ్ఛాటనము..

ఉత్తిష్టంతు భూత పిశాచా: ఏతే భూమి భారకా:

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

ఈ శ్లోకము చదివి.. అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమ చేతి వైపు నుంచి వెనక్కి వేయ్యాలి.

ఆ తర్వాత అథ: ప్రాణాయామ: .. చేయాలి

అనంతరం సంకల్పం చెప్పుకోవాలి

కలశ పూజ చేయాలి.

ఉద్వాసన మంత్రాలు ఆచరించిన తర్వాత.. ఏ వ్రతమైనా.. పూజ కానీ ప్రారంభించాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ మాత్రం ఉంచవద్దు.. ఎందుకంటే..

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ తిరిగినట్లే..

మరిన్నీ ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2025 | 02:42 PM