Hyderabad: ఆ ఏరియాల్లో 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ కట్..
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:48 AM
నగరంలోని గాజులరామారం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో 132కేవీ లైన్ మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నామని ఏఈ చైతన్యభార్గవ్ తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
గాజులరామారం(హైదరాబాద్): గాజులరామారం విద్యుత్ సబ్స్టేషన్(Gajularamaram Electricity Substation) పరిధిలో 132కేవీ లైన్ మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నామని ఏఈ చైతన్యభార్గవ్(AE Chaitanya Bhargava) తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, చంద్రగిరినగర్ చౌరస్తా, అంబేడ్కర్నగర్, ఉమాదేవినగర్, ఎన్టీఆర్నగర్, జనని స్కూల్ లైన్, చంద్రగిరినగర్ దర్గాలైన్,

బాలాజీ స్కూల్ లైన్, పీపీనగర్, మజీద్ లైన్, జహంగీర్ బస్తీ, ఇందిరానగర్ బీ, ఎంఎఫ్ ఫంక్షన్హాల్, తిరుపతిరెడ్డి బస్తీ, ఎస్సీబీ నగర్లలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
Read Latest Telangana News and National News