Hyderabad: సీఐసీగా చంద్రశేఖర్రెడ్డి ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - May 10 , 2025 | 04:48 AM
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా ఐఎ్ఫఎస్ అధికారి జి.చంద్రశేఖర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా ఐఎ్ఫఎస్ అధికారి జి.చంద్రశేఖర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జి.చంద్రశేఖర్రెడ్డితో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు చంద్రశేఖర్రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News