CM Revanth Reddy: ఎన్డీఎష్కు విరాళంగా నెల వేతనం
ABN , Publish Date - May 10 , 2025 | 05:05 AM
నేషనల్ డిఫెన్స్ ఫండ్(ఎన్డీఎ్ఫ)కు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.

ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నేతలు, ప్రజలు విరాళాలివ్వాలని పిలుపు
హైదరాబాద్, మే 9(ఆంధ్రజ్యోతి): నేషనల్ డిఫెన్స్ ఫండ్(ఎన్డీఎ్ఫ)కు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేందుకు, దేశ ప్రజల్ని కాపాడేందుకు భారత జవాన్లు చేస్తున్న పోరాటానికి చేయూతగా తన వంతు విరాళం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన సహచరులు, కాంగ్రెస్ నాయకులు, పౌరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి పిలుపునకు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.
నేషనల్ డిఫెన్స్ ఫండ్కు నెల వేతనాన్ని విరాళంగా సమర్పిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు ఈ అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. ఈ అంశంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ కూడా వారి ఒకరోజు వేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News