KTR Comments: కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:51 PM
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. కాంగ్రెస్ సర్కార్కు ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడం..
హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. కాంగ్రెస్ సర్కార్కు ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడం చేతకాదు.. సుంకిశాల రిటైనింగ్ వాట్ సరిగ్గా కట్టించే తెలివి లేదు.. చివరికి ఓ చెక్ డ్యూమ్ కూడా నిర్మించలేని కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం బురద జల్లుతారని, ఇది సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు.
మహబూబ్నగర్లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ రెండునెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటర్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒక్కరిపై సర్కారు చర్య తీసుకుని బాధితులను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని దద్దమ్మ ప్రభుత్వం అని.. కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలంటూ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
కేటీఆర్ పోస్ట్ యధావిధిగా..
‘SLBC టన్నెల్ తొవ్వడం చేతకాదు.. సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు.. చివరికి ఓ చెక్ డ్యామ్ ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు.. మహబూబ్నగర్ లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ రెండునెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి. నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటర్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒక్కరిపై సర్కారు చర్య తీసుకుని బాధితులను ఆదుకోవాలి. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలి.’ అని ఎక్స్లో కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read:
రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ దుర్వినియోగం చేస్తోంది: సీఎం
ఫోన్లు పడేసే ముందు తెలుసుకోండి..లేదంటే మీకే
For More Telangana News and Telugu News..