BIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా..
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:56 AM
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేస్తూ ధర్మాసనం ప్రకటించింది. తిరిగి ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు.
హైదరాబాద్, అక్టోబర్ 08: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేస్తూ ధర్మాసనం ప్రకటించింది. తిరిగి ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. తొలుత విచారణ ప్రారంభమవగానే.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణపైనా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం.. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కాగా, బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
కాగా, బీసీ రిజర్వేషన్లపై అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుంది. హైకోర్టు నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం మించడానికి అవకాశం లేదు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రిజర్వేషన్లు 67 శాతానికి పెరిగాయి. బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించింది ప్రభుత్వం. హైకోర్టు ఒకవేళ ఈ జీవోను కొట్టివేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
Also Read:
అడ్లూరి ఎపిసోడ్పై పొన్నం క్లారిటీ
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా కొత్త టీం