NTR Trust: 28 ఏళ్ల మీ సేవా కార్యక్రమాలకు అభినందనలు.. ఎంతో మందికి మేలు..
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:46 AM
ఎన్టీఆర్ ట్రస్ట్ 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రస్ట్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. సమాజ సేవలో ముందంజలో నిలిచి అనేక రంగాల్లో పేదలు, విద్యార్థులు సహా పలువురికి మానవీయంగా సేవలు అందిస్తున్నందుకు మెచ్చుకున్నారు.

సమాజ సేవా రంగంలో ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) 28 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ap cm chandrababu naidu) ట్రస్ట్ సిబ్బందికి, నిర్వాహకులకు, దాతలకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ & సాయం, సాధికారత & జీవనోపాధి రంగాలలో పేదలకు, ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయమన్నారు. ఈ క్రమంలో మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ... మీ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు చంద్రబాబు.
అనేక మందికి మేలు
ఎన్టీఆర్ ట్రస్ట్.. మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చటానికి, ఆయనే చూపించిన దారిలో సామాజిక సేవ చేస్తుందని కొనియాడారు చంద్రబాబు. సమాజంలో పేదరికాన్ని తగ్గించడంలో ఈ ట్రస్ట్ ఎంతో దోహదపడుతుందన్నారు. దీనికి తోడు మీరు చేస్తున్న సేవా కార్యకలాపాలు, సమాజంలో సద్గుణాలను పెంచి మరింత మందికి మేలు చేస్తాయని నమ్ముతున్నట్లు భావించారు. మీ సేవా స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తూ, మీరు చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమైన మార్పులకి దారితీస్తాయన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు
ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు ఆరోగ్య సమస్యలు, విద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక రంగాల్లో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, విపత్తు నిర్వహణ & సాయం, సాధికారత & జీవనోపాధి వంటి రంగాల్లో విస్తృతమైన సేవలను నిర్వహిస్తోంది. ఈ సేవల ద్వారా అనేక కుటుంబాలు తమ జీవనోపాధిని మెరుగుపర్చుకోవడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణలో సాయాన్ని కూడా పొందుతున్నాయి.
విపత్తుల సమయంలో
ఎన్టీఆర్ ట్రస్ట్ వివిధ ప్రకృతి విపత్తుల సమయంలో కూడా స్పందించి, బాధితులను ఆదుకునే ప్రయత్నం చేసింది. వరదలు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో అనేక మంది పేదలకు తక్షణ సహాయం అందించి, వారికి భరోసా కల్పించింది. విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యాలు నేర్పడం, మహిళా సాధికారతను పెంచడం వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో పేదలకు అండగా నిలిచి, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, వారి జీవనశైలిని మెరుగుపర్చేందుకు కృషి చేస్తుంది.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయాలు
ఇప్పటివరకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక పేదరిక నివారణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలు, పేదలకు అండగా నిలిచే విధానాలు, సమాజంలో మార్పుకు దారితీసే కార్యక్రమాలు అమలు చేస్తుంది. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ సామాజిక సేవా రంగంలో 28 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆపన్నులకు, పేదలకు మరిన్ని సేవలను అందించాలని ట్రస్ట్ సంకల్పించింది.
ఇవి కూడా చదవండి..
జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
Read Latest Telangana News And Telugu News