శాలివాహన భూములను అమ్మవద్దు
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:00 PM
పాత మంచిర్యాలలో శాలివాహన పవర్ ప్లాంటును మూసివేసి ఆ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాంటులో పని చేస్తున్న కార్మికులు ఆదివారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

మంచిర్యాల క్రైం, జన వరి 12(ఆంద్రజ్యోతి) : పాత మంచిర్యాలలో శాలివాహన పవర్ ప్లాంటును మూసివేసి ఆ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాంటులో పని చేస్తున్న కార్మికులు ఆదివారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ప్లాంటు మూసివేసి బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యజమాని మల్క కొము రయ్య కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కంపెనీకి చెందిన భూములను కొందరు రియల్ వ్యాపారులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఎవరైనా రియల్ వ్యాపారులు భూమిని కొంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. సంఘం అద్యక్షుడు కుంటాల శంకర్, మాజీ అద్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, శెట్టి శ్రీనివాస్, దేవి ప్రసాద్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.