Share News

Ration cards: కొత్త రేషన్‌ కార్డులకు అర్హులు 29వేల మంది..

ABN , Publish Date - Feb 27 , 2025 | 08:01 AM

కొత్త రేషన్‌ కార్డుల(Ration cards) జారీకి హైదరాబాద్‌(Hyderabad) జిల్లా పరిధిలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, ఇటీవల చేపట్టిన కులగణన సమయంలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు.

Ration cards: కొత్త రేషన్‌ కార్డులకు అర్హులు 29వేల మంది..

- మీసేవ ద్వారా 1.2 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌ సిటీ: కొత్త రేషన్‌ కార్డుల(Ration cards) జారీకి హైదరాబాద్‌(Hyderabad) జిల్లా పరిధిలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, ఇటీవల చేపట్టిన కులగణన సమయంలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. వీటిలో హైదరాబాద్‌ పరిధిలో 29 వేల మంది అర్హులున్నట్లు గుర్తించామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: ORR: ఓఆర్‌ఆర్‌పై కొత్త ఎగ్జిట్‌.. నార్సింగ్‌ టోల్‌ప్లాజాకు ముందు నిర్మాణం


వీటితోపాటు మీసేవ కేంద్రాల(Meeseva Kendras) నుంచి ఇప్పటి వరకు జిల్లా పరిధిలో 1.2 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లా పరిధిలో 70 వేల నుంచి 80 వేల మంది అర్హులు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి 1 తర్వాత ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఆ దిశగా జీహెచ్‌ఎంసీ, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

city3.2.jpg


ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?

ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్‌ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ

ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2025 | 08:01 AM