Share News

YouTube Premium Lite: రూ.89కే యాడ్ ఫ్రీ యూట్యూబ్..కొత్త ప్రీమియం లైట్ ఆఫర్ ప్రకటన

ABN , Publish Date - Sep 29 , 2025 | 07:20 PM

భారత వినియోగదారులకు యూట్యూబ్‌ ఓ బిగ్ అప్‌డేట్‌ ఇచ్చింది. ఇప్పుడు కేవలం నెలకు రూ.89 చెల్లించి యాడ్స్ లేకుండా ఆనందంగా యూట్యూబ్ వీక్షించవచ్చని తెలిపింది. అందుకోసం యూట్యూబ్ ప్రీమియం లైట్ తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

YouTube Premium Lite: రూ.89కే యాడ్ ఫ్రీ యూట్యూబ్..కొత్త ప్రీమియం లైట్ ఆఫర్ ప్రకటన
YouTube Premium Lite

భారతీయ వీక్షకుల కోసం యూట్యూబ్ కొత్తగా తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ పేరు యూట్యూబ్ ప్రీమియం లైట్ (YouTube Premium Lite), దీని ధర నెలకు కేవలం రూ.89 మాత్రమే. అంటే యాడ్ బ్రేక్‌లతో విసిగిపోయిన వారికి, పూర్తి ప్రీమియం ఫీచర్లు అవసరం లేని వారికి ఈ ప్లాన్ మంచి ఛాయిస్. సాధారణ యూట్యూబ్ వీడియోలను ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలనుకునే వారికి ఇది చక్కగా సరిపోతుంది.


ఏంటి ఈ కొత్త ప్లాన్?

ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని దేశాల్లో పరీక్షించిన తర్వాత, యూట్యూబ్ ఈ ప్రీమియం లైట్ ప్లాన్‌ను ఇప్పుడు భారతదేశంలో ప్రవేశపెట్టింది. నెలకు రూ.149 ధరతో ఉన్న సాధారణ ప్రీమియం ప్లాన్ చాలా మందికి ఖరీదైనదని భావించిన వారికి రూ.89 ప్లాన్ ఒక మంచి ఆప్షన్. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌కు 125 మిలియన్లకు పైగా చెల్లింపు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో మ్యూజిక్, ప్రీమియం, ట్రయల్ యూజర్లు కూడా కలరు. ఈ కొత్త లైట్ ప్లాన్ ద్వారా భారత మార్కెట్‌లో ఈ సంఖ్యను మరింత పెంచాలని యూట్యూబ్ లక్ష్యంగా పెట్టుకుంది.


యూట్యూబ్ ప్రీమియం లైట్‌లో ఏముంది?

ప్రీమియం లైట్ ప్లాన్‌లో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు యూట్యూబ్ షార్ట్స్, మ్యూజిక్ సంబంధిత వీడియోలు లేదా బ్రౌజింగ్, సెర్చ్ సమయంలో కొన్ని యాడ్‌లు కనిపించవచ్చు. ఇవి రూ.149 ప్రీమియం ప్లాన్‌తో పోలిస్తే తక్కువ సౌకర్యాలను అందిస్తాయి. ఎందుకంటే పూర్తి ప్రీమియం ప్లాన్‌లో ప్లాట్‌ఫామ్ మొత్తం మీద యాడ్-ఫ్రీ అనుభవం లభిస్తుంది. కానీ రూ.89 ప్లాన్ ద్వారా మీరు సాధారణ యూట్యూబ్ వీడియోలను చూసేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్‌లు లేకుండా మాత్రమే ఆస్వాదించవచ్చు.


ఎక్కడెక్కడ పనిచేస్తుంది?

ఈ లైట్ సబ్‌స్క్రిప్షన్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు వంటి అన్ని డివైస్‌లలో పనిచేస్తుంది. కాబట్టి, మీరు ఎక్కడైనా, ఎలాంటి డివైస్‌లోనైనా యాడ్-ఫ్రీ అనుభవాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ భారతదేశంలో దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. భారతదేశంలో వీడియో వినియోగం ఇటీవలి సంవత్సరాల్లో విపరీతంగా పెరిగింది. చాలా మంది యూజర్లు ఇప్పటికీ ఉచిత, యాడ్-సపోర్టెడ్ యూట్యూబ్ వెర్షన్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త లైట్ ప్లాన్ ద్వారా యూట్యూబ్ ఆ యూజర్లను సబ్‌స్క్రిప్షన్ వైపు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 07:34 PM