Share News

Sanju Samson Key Decision: సంజూ శాంసన్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:27 PM

భార‌త టీ20 టీ20 జ‌ట్టులో త‌న స్ధానాన్ని ప‌దిలం చేసుకున్న సంజూ శాంస‌న్‌.. ఇప్పుడు వ‌న్డే జ‌ట్టులోకి కూడా రావాలని త‌హత‌హ‌లాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుత‌మైన రికార్డు ఉంది. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇప్పటివ‌ర‌కు ఇండియా త‌ర‌ఫున 16 వ‌న్డేలు ఆడి 56.67 స‌గ‌టుతో 510 ప‌రుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

 Sanju Samson Key Decision: సంజూ శాంసన్ సంచలన నిర్ణయం
Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్-2026కు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు రెడీ అయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ శాంసన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో సంజూ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం21 బంతుల్లో 37 పరుగులు చేసి. భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.


భార‌త టీ20 టీ20 జ‌ట్టులో త‌న స్ధానాన్ని ప‌దిలం చేసుకున్న సంజూ శాంస‌న్‌(Sanju Samson).. ఇప్పుడు వ‌న్డే జ‌ట్టులోకి కూడా రావాలని త‌హత‌హ‌లాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుత‌మైన రికార్డు ఉంది. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇప్పటివ‌ర‌కు ఇండియా త‌ర‌ఫున 16 వ‌న్డేలు ఆడి 56.67 స‌గ‌టుతో 510 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. అందుకే ఈ టోర్నీలో ఆడాలని సంజూ నిర్ణయించుకున్నాడు. కాగా ఈ ఏడాది దేశ‌వాళీ వ‌న్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఆడ‌నున్నారు.


కేరళ జ‌ట్టుకు యువ ఓపెన‌ర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. అలానే ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ కు జ‌ట్టులో స్థానం లభించింది. కేర‌ళ జ‌ట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. విజయ్ హజారే టోర్నీ(Vijay Hazare Trophy 2025)లో కేర‌ళ జ‌ట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేర‌ళ‌తో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.


కేరళ జట్టు:

రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్, మహమ్మద్ అజహరుద్దీన్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.


ఇవీ చదవండి:

Ashes Series 2025: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా జయభేరి..

ఇప్పుడు గిల్.. నెక్స్ట్ సూర్యకుమార్.?

Updated Date - Dec 21 , 2025 | 01:03 PM