Prithvi Shaw: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన.. కెప్టెన్గా పృథ్వీషా
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:00 PM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ప్రారంభానికి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టోర్నీ కోసం తమ జట్టు కెప్టెన్గా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాను నియమించింది.
ఇంటర్నెట్ డెస్క్: సయ్యద్ ముస్తాక్ అలీ 2025-26 టోర్నీ కోసం మహారాష్ట్ర జట్టు కెప్టెన్ గా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీషా(Prithvi Shaw) ఎంపికయ్యాడు. త్వరలో ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఎంసీఎ ప్రకటించిన సంగతి తెలిసిందే. రుతురాజ్ తప్పుకోవడంతో పృథ్వీషాను కెప్టెన్ పోస్టు వరించింది. ఇటీవల రంజీ ట్రోఫీలో అతడు బాగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రుతురాజ్ తర్వాత ఎంసీఏకు పృథ్వీషానే తొలి ప్రాధాన్యంగా కనిపించాడు.
వాస్తవానికి రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర జట్టు( Maharashtra team)కు కెప్టెన్ గా వ్యవహరించాల్సి ఉంది. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ నుంచి రుతురాజ్కు పిలుపు వచ్చింది. దీంతో అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర జట్టు సారథి మార్పు అనివార్యమైంది. ఎంసీఎ సెలక్టర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని మాత్రమే షాకు తెలియజేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం(నవంబర్ 24) అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. పృథ్వీ షాకు కెప్టెన్గా అనుభవం ఉంది. అదే ఎంసీఏ షా ఎంపికలో కీలకమైందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
గతంలో పృథ్వీషా ఫస్ట్క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో ముంబై జట్టుకు పలు మ్యాచ్ల్లో సారథ్యం వహించాడు. కాగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్కు ముందు పృథ్వీ ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన సంగతి తెలిసిందే. ముంబై క్రికెట్ అసోయేషిన్తో విబేధాలు కారణంగా షా మహారాష్ట్ర జట్టులోకి వచ్చాడు. ప్రస్తుత రంజీ సీజన్లో షా 7 ఇన్నింగ్స్లు ఆడి 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mustaq Ali Trophy 2025-26) నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర గ్రూప్ బిలో ఉంది. మహారాష్ట్ర తన తొలి మ్యాచ్ ను జమ్మూ కాశ్మీర్తో తలపడనుంది. గ్రూప్ బిలో హైదరాబాద్, చండీగఢ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గోవాతో తలపడనున్నాయి. ఈ అన్ని లీగ్ మ్యాచ్లు కోల్కతాలో జరుగుతాయి.
SMAT 2025-26 టోర్నీకి మహారాష్ట్ర జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, నిఖిల్ నాయక్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, రామకృష్ణ ఘోష్, రాజవర్ధన్ హంగర్గేకర్, జలజ్ సక్సేనా, అజీమ్ కాజీ, అర్షిన్ కులకర్ణి, ముఖేష్ చౌదరి, విక్కీ ఓస్త్వాల్, ప్రశాంత్ సోలంకి, మందార్ భండారి, యోగేష్ డోంగరే, యోగేష్ డోంగరే
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్దే.. జట్టుపై అభినందనలు..
Mohsin Naqvi: పాకిస్థాన్కు ఆసియా కప్ ట్రోఫీని అందజేసిన నఖ్వీ