Share News

Indian women blind cricket: అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:49 PM

భారత్‌కు చెందిన అంధ మహిళల క్రికెట్ జట్టు టీ-20 ప్రపంచకప్ గెలిచింది. నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Indian women blind cricket: అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
Indian women blind cricket

ఇంటర్నెట్ డెస్క్: అంధ మహిళల క్రికెట్ టీ-20 ప్రపంచ కప్ భారత్ కైవసం అయ్యింది. నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది (Indian women blind cricket).


నేపాల్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత జట్టు 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది (Blind T20 Women’s World Cup). భారత బ్యాటర్లలో పూలా సరెన్ (27 బంతుల్లో 44) రాణించింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, నేపాల్ జట్లు పాల్గొన్నాయి. కాగా, టీ-20 ప్రపంచకప్ సాధించిన జట్టుపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ మడుగులో మొసలి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..

అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా: విజయసాయిరెడ్డి

Updated Date - Nov 23 , 2025 | 08:10 PM