IPL 2025 Update: భారత్, పాక్ యుద్ధానికి బ్రేక్..ఐపీఎల్ నుంచి కీలక అప్‎డేట్..

ABN , First Publish Date - 2025-05-10T21:05:24+05:30 IST

కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం‌తో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మళ్లీ క్రికెట్ ప్రేమికుల చూపు ఐపీఎల్‌పై పడింది. వారం రోజులుగా వాయిదా పడ్డ ఈ టోర్నీ మళ్లీ మొదలుకానుంది.

IPL 2025 Update: భారత్, పాక్ యుద్ధానికి బ్రేక్..ఐపీఎల్ నుంచి కీలక అప్‎డేట్..
IPL 2025 update

భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు శనివారం (మే 10న) అంగీకరించిన నేపథ్యంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఈ రెండు దేశాల ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజుల పాటు వాయిదా వేశారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తే, ఐపీఎల్ మరికొన్ని రోజుల్లోనే మొదలు కానుంది. కానీ వచ్చే మ్యాచ్‌లను నిర్వహించడానికి మాత్రం ఈసారి దక్షిణ భారతదేశంలోని మూడు నగరాలను ఎంచుకోవచ్చని తెలుస్తోంది.


ఈ మూడు నగరాల్లోనే..

దీనికోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం 18వ సీజన్ ఐపీఎల్ 2025 చివరి దశకు వచ్చేసింది. ప్లేఆఫ్ మ్యాచ్‌లతో సహా ఇంకా 16 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ప్రభుత్వం వెంటనే ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇచ్చినా కూడా టోర్నమెంట్ ప్రారంభించడానికి విదేశీ ఆటగాళ్ల లభ్యత సవాలని చెప్పవచ్చు. ఎందుకంటే టోర్నమెంట్ వాయిదా పడిన తరువాత వివిధ ఫ్రాంచైజీల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సహా అనేక మంది కూడా వారి ఇళ్లకు తిరిగి వెళ్లారు.


టోర్నమెంట్ వారం వాయిదా

కానీ ఇప్పుడు వారంతా తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మే నెలలోనే టోర్నమెంట్ తిరిగి ప్రారంభమైతే విదేశీ ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లోనే స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. IPL 2025లో ఇప్పటివరకు మొత్తం 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 58వ మ్యాచ్‌ను మధ్యను నిలిపివేసి రద్దు చేశారు. ఆ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం రోజు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి

Donald Trump: ట్రంప్ మ్యాజిక్..భారత్-పాక్, ఉక్రెయిన్-రష్యా ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్


India Pakistan Tensions: ఇండియాతో ఉద్రిక్తత..దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి, కేజీ ఉల్లి రూ.300


India Pakistan Tensions: పాకిస్తాన్‎ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..


Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి


యుద్ధం నేనే ఆపాను: కేఏ పాల్

Updated Date - 2025-05-10T21:07:46+05:30 IST