Share News

Toxic Work Culture: మేనేజర్ తీరుకు యువతి షాక్.. సెలవు రోజున డ్యూటీకి రాలేదని..

ABN , Publish Date - Apr 17 , 2025 | 07:28 PM

సెలవు రోజున డ్యూటీకి రానన్న యువతిపై పరోక్ష పద్ధతుల్లో ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఓ మేనేజర్ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌‌లో ఉంది. జనాలకు ఇది షాక్‌కు గురి చేస్తోంది.

Toxic Work Culture: మేనేజర్ తీరుకు యువతి షాక్.. సెలవు రోజున డ్యూటీకి రాలేదని..
Employee Frustration

ఇంటర్నట్ డెస్క్: సెలవు రోజున డ్యూటీకి రాన్ననందుకు మేనేజర్ విమర్శలను తట్టుకోలేకపోయిన ఓ యువతి తన ఆవేదనను నెట్టింట పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మేనేజర్ తీరు సబబేనా అంటూ ఆమె వేసిన ప్రశ్న నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.

రెడిట్‌లో సదరు యువతి తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది. ‘‘నేను ఓ షాపింగ్ మాల్‌లోని దుస్తుల దుకాణంలో పని చేస్తున్నాను. ఇటీవల మా షాపులోని సగం మంది సిబ్బందిని ఎటువంటి వార్నింగ్ లేకుండా తీసేశారు. ఇప్పుడు నేను, మా మేనేజర్, మరో పార్ట్‌టైం వర్కర్ తప్ప ఎవరూ లేరు. ఇటీవల ఓసారి గురువారం సెలవు తీసుకుందామని అనుకున్నాను. ఆ మేరకు లీవ్ కూడా దొరికింది.

‘‘నాకు కొన్ని వ్యక్తిగత పనులు ఉన్నాయి. డాక్టర్‌ను కూడా కలవాల్సి ఉంది. కానీ సెలవు రోజున సరిగ్గా ఉదయం 8 గంటలకు మా మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ రోజు షాపులో జనాల తాకిడి ఎక్కువగా ఉందని, డ్యూటీకి రావాలని నన్ను పిలిచారు. కానీ నేను మాత్రం రానని చెప్పేశాను. వేరు పనులను అంతకుముందు రోజే ప్లాన్ చేసిపెట్టుకున్నానని అన్నాను’’ అని ఆమె చెప్పుకొచ్చారు.


ఆ తరువాత మేనేజర్ తన మెసేజీకి రిప్లై కూడా ఇవ్వలేదని తెలిపారు. అంతేకాకుండా తనపై పరోక్ష విమర్శలు కూడా చేశారని చెప్పుకొచ్చారు. కొందరు స్వార్థపరులు అని తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో పోస్టు చేసుకున్నారని చెప్పారు. ‘‘నాకు ఇచ్చేదే గంటకు 15 డాలర్ల జీతం. ఇతర ప్రయోజనాలు ఏమీ లేవు. జీతంతో కూడిన సెలవులు అసలే లేవు. ఇది చాలదన్నట్టు షాపులో సగం మంది సిబ్బందిని తొలగించావు. ఇది చాలదన్నట్టు పైసా పుచ్చుకోకుండా సంస్థకు కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నావా. ఇప్పుడేమో కనీసం నాతో మాట కూడా మాట్లడకుండా ఒత్తిడి తెచ్చేందుకు ట్రై చేస్తున్నావు’’ అని ఆమె పేర్కొంది.


ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తమకూ ఇలాంటి అనేక అనుభవాలు ఉన్నాయని నెటిజన్లు పేర్కొన్నారు. ‘‘నువ్వు కూడా లేకపోతే షాపు మూసేసుకోవాల్సి వస్తుందని ఓసారి గుర్తు చేయ్యి అప్పుడు బుద్ధొ్స్తుంది’’ అని ఒకరు సలహా ఇచ్చారు. కొందరు మేనేజర్లకు సంస్థను నిర్వహించడకంటే ఉద్యోగులపై అజమాయిషీ చేయడమే ఎక్కువ ఇష్టం అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో వింత రేసు.. వీర్య కణాల మధ్య పరుగుపందెం.. భారీ స్థాయిలో ఏర్పాట్లు

జాబ్‌‌లో మజా లేదని యువతి రాజీనామా.. షాక్‌లో సంస్థ యజమాని

ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..

Read Latest and Viral News

Updated Date - Apr 17 , 2025 | 07:28 PM