Wildlife Safari Tour: వణ్యప్రాణులను చూడటానికి దేశంలోని 5 ఉత్తమ ప్రదేశాలివే..
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:59 PM
భారతదేశం అనేక రకాల వణ్యప్రాణులకు నిలయమని చెప్పొచ్చు. వణ్యప్రాణులను చూడాలనుకునే వారికి అనేక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ..
1/6
భారతదేశం అనేక రకాల వణ్యప్రాణులకు నిలయమని చెప్పొచ్చు. వణ్యప్రాణులను చూడాలనుకునే వారికి అనేక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 5 ఉత్తమ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2/6
రాజస్థాన్లోని రణథంబోర్ నేషనల్ పార్క్ దేశంలోనే ప్రసిద్ధి చెందింది. ఈ పార్క్లో వణ్యప్రాణులతో పాటూ పురాతన శిథిలాలు, చారిత్రాత్మక కోటలను కూడా చూడొచ్చు. బెంగాల్ టైగర్తో పాటూ అనేక రకాల పులులు, చిరుతులు, ఎలుగుబంట్లు, మొసళ్లు తదితరాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
3/6
అస్సాంలోని కాజీరంగ జాతీయ ఉద్యానవనం కూడా వణ్యప్రాణుల సదర్శనకు ఉత్తమ ప్రదేశమని చెప్పొచ్చు. అంతరించిపోతున్న ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను ఒక్కడ చూడొచ్చు. అలాగే అడవి నీటి గేదెలు, చిత్తడి జింకలతో పాటూ వివిధ రకాల పక్షులను కూడా ఇక్కడ సందర్శించవచ్చు.
4/6
మధ్యప్రదేశ్లోని కన్హా నేషనల్ పార్క్.. దేశంలోని సుందరమైన జాతీయ ఉద్యానవనాల్లో ఒకటి. ఇక్కడ బెంగాల్ టైగర్, చిత్తడి జంకలు, చిరుతలు, అడవి కుక్కలు తడితర జంతువులను చూడొచ్చు.
5/6
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనంలోనూ అనేక వణ్యప్రాణులను చూడొచ్చు. ఈ ప్రాంతం రాయల్ బెంగాల్ టైగర్ నివాస స్థలమని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ అనేక మొసళ్లు, అరుదైన పక్షులు కూడా కనువిందు చేస్తాయి.
6/6
కర్ణాటక బందీపూర్ జాతీయ ఉద్యానవనం.. ఏనుగులు, పులులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక వణ్యప్రాణులతో పాటూ అనేక రకాల వృక్షాలు, పచ్చని ప్రకృతి పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
Updated at - Jun 29 , 2025 | 03:59 PM