పండగ రాకతో బస్టాండ్లలో జనాల కిటకిట..
ABN, Publish Date - Aug 09 , 2025 | 05:51 PM
వీకెంట్, రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన బస్టాండ్లలో రద్దీ నెలకొంది. సంగారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది.
1/6
వారాంతం, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రజలంతా పిల్లాపాపలతో కలిసి సొంతూళ్లకు పయనమయ్యారు.
2/6
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
3/6
భారీ ఎత్తున ప్రజలు సొంతూళ్లకు కుటుంబసమేతంగా బయల్దేరడంతో బస్టాండ్లన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి.
4/6
విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ సమయం గడిచే కొద్దీ ఊళ్లకు పయనమయ్యే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
5/6
భారీ ట్రాఫిక్ జాం దాటుకుని బస్సులు బస్టాండ్ చేరుకునేసరికి ఆలస్యమవుతుంది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
6/6
అయితే, పండగను క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ బస్సులు పేరిట 30 శాతం అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated at - Aug 09 , 2025 | 06:04 PM