Yadagirigutta: యాదగిరి గుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
ABN, Publish Date - Jan 10 , 2025 | 08:40 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. స్వామి వారిని దర్శించుకోడానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

శుక్రవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రధానాలయ ఉత్తర ద్వారం నుంచి గరుడ వాహనంపై భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చారు.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

క్తులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ముక్కోటి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించారు.

పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.

స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

ఆలయంలో స్వామివార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ అధికారులు తెలిపారు.
Updated at - Jan 10 , 2025 | 11:52 AM