Ujjaini Mahakali Temple In Secundrabad: తొలి ఏకాదశి.. ఉజ్జయిని మహాకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jul 06 , 2025 | 03:32 PM
ఆషాఢ మాసం ప్రారంభమైందంటేనే.. తెలంగాణలో బోనాలు పండగ వచ్చినట్లు. ఈ పండగ సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మ వారికి బోనం సమర్పించేందుకు ఈ దేవాలయానికి మహిళలు భారీగా తరలి వచ్చారు. ఆ క్రమంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అదీకాక ఆదివారం అంటే.. జులై 06 తొలి ఏకాదశి. ఈ రోజు అత్యంత పర్వదినం. ఈ సందర్భంగా మహాకాళి ఆలయంతోపాటు సికింద్రాబాద్లోని విఠలేశ్వర దేవాలయానికి సైతం భక్తులు పోటెత్తారు. అమ్మ, అయ్యవారుల దర్శనం కోసం భక్తుల.. రహదారులపై బారులు తీరారు.
1/9
బోనాల పండగతోపాటు తొలి ఏకాదశి పర్వదినం కావడంతో.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
2/9
ఆలయం వద్ద భక్తుల కిటకిట..
3/9
అమ్మవారి దర్శనం కోసం క్యూలో నిలబడ్డ భక్తులు
4/9
ఆలయం వద్ద భక్తుల రద్దీ..
5/9
ఉజ్జయిని మహాకాళి ఆలయం లోపల భక్తుల రద్దీ..
6/9
అమ్మవారి దర్శనానికి బోనంతో వస్తున్న మహిళ.. క్యూలో నిలబడ్డ భక్తులు..
7/9
ఆలయంలో అమ్మవారు..
8/9
అమ్మవారిని దర్శించుకుని దణ్ణం పెడుతున్న భక్తులు..
9/9
అమ్మవారి దర్శనానికి క్యూలో నిలబడిన భక్తులు
Updated at - Jul 06 , 2025 | 03:34 PM