Ujjaini Mahakali Temple In Secundrabad: తొలి ఏకాదశి.. ఉజ్జయిని మహాకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jul 06 , 2025 | 03:32 PM
ఆషాఢ మాసం ప్రారంభమైందంటేనే.. తెలంగాణలో బోనాలు పండగ వచ్చినట్లు. ఈ పండగ సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మ వారికి బోనం సమర్పించేందుకు ఈ దేవాలయానికి మహిళలు భారీగా తరలి వచ్చారు. ఆ క్రమంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అదీకాక ఆదివారం అంటే.. జులై 06 తొలి ఏకాదశి. ఈ రోజు అత్యంత పర్వదినం. ఈ సందర్భంగా మహాకాళి ఆలయంతోపాటు సికింద్రాబాద్లోని విఠలేశ్వర దేవాలయానికి సైతం భక్తులు పోటెత్తారు. అమ్మ, అయ్యవారుల దర్శనం కోసం భక్తుల.. రహదారులపై బారులు తీరారు.

బోనాల పండగతోపాటు తొలి ఏకాదశి పర్వదినం కావడంతో.. ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఆలయం వద్ద భక్తుల కిటకిట..

అమ్మవారి దర్శనం కోసం క్యూలో నిలబడ్డ భక్తులు

ఆలయం వద్ద భక్తుల రద్దీ..

ఉజ్జయిని మహాకాళి ఆలయం లోపల భక్తుల రద్దీ..

అమ్మవారి దర్శనానికి బోనంతో వస్తున్న మహిళ.. క్యూలో నిలబడ్డ భక్తులు..

ఆలయంలో అమ్మవారు..

అమ్మవారిని దర్శించుకుని దణ్ణం పెడుతున్న భక్తులు..

అమ్మవారి దర్శనానికి క్యూలో నిలబడిన భక్తులు
Updated at - Jul 06 , 2025 | 03:34 PM