Indiramma Canteens: హైదరాబాద్లో ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్ల ప్రారంభం
ABN, Publish Date - Sep 30 , 2025 | 06:45 AM
హైదరాబాద్లోని మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో కొత్త ఇందిరమ్మ క్యాంటీన్లను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
1/9
హైదరాబాద్లోని మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో కొత్త ఇందిరమ్మ క్యాంటీన్లను సోమవారం ప్రారంభించారు.
2/9
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
3/9
సోమవారం నుంచే రూ.5లకే బ్రేక్ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది.
4/9
తొలిదశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
5/9
తర్వాత భాగ్యనగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ.
6/9
రోజుకూ 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించనుంది. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ ఉండనున్నాయి.
7/9
ప్లేట్కు రూ.19ల ఖర్చు అవుతుండగా... రూ. 14లను భరించనుంది జీహెచ్ఎంసీ.
8/9
ఈ క్యాంటీన్లు వారానికి ఆరురోజులు కొనసాగుతుండగా.. ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది.
9/9
ఇప్పటికే 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5లకే మధ్యాహ్న భోజనం అందిస్తోంది బల్దియా.
Updated at - Sep 30 , 2025 | 06:49 AM