గవర్నర్ బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ

ABN, Publish Date - May 10 , 2025 | 07:05 AM

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తకాన్ని రచించారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌‌లో జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం నాడు ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ అన్వర్ , హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు మనోహర్ లాల్ కట్టర్, కిషన్‌రెడ్డి, అర్జున్ రామ్ మేఘవాల్, మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, పలువురు ఎంపీలు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 1/11

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తకాన్ని రచించారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 2/11

జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం నాడు ఆవిష్కరించారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 3/11

పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ అన్వర్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ హాజరయ్యారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 4/11

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు మనోహర్ లాల్ కట్టర్, కిషన్‌రెడ్డి, అర్జున్ రామ్ మేఘవాల్, మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, పలువురు ఎంపీలు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 5/11

ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను రాసిన 'జనతా కీ కహాని ఆత్మకథ' పుస్తకాన్ని శుక్రవారం నాడు విడుదల చేశానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 6/11

ఈ కార్యక్రమంలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించామని బండారు దత్తాత్రేయ చెప్పారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 7/11

పాత్ర, అంకితభావం, సంకల్పం తన జీవితంలోని మూడు ముఖ్యమైన అంశాలని బండారు దత్తాత్రేయ తెలిపారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 8/11

తన జీవితంలోని ఈ మూడు కోణాల్లో పని చేయడం ద్వారా ప్రతి సవాళ్లను ఎదుర్కొన్నానని బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ పుస్తకం తన జీవితంలోని వివరణాత్మక అనుభవాలను సంకలనం చేస్తుందని బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 9/11

ఈ పుస్తకం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని బండారు దత్తాత్రేయ ఉద్ఘాటించారు. తన జీవితం ఎప్పుడూ సామాన్య సమాజ శ్రేయస్సుకే అంకితమని బండారు దత్తాత్రేయ తెలిపారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 10/11

తన తల్లి ఈశ్వమ్మా జీ తనకు ఎంతో స్పూర్తి అని బండారు దత్తాత్రేయ తెలిపారు. తాను సామాజిక కార్యక్రమాల్లో, ముఖ్యంగా మురికివాడల అభివృద్ధి, విపత్తు సహాయ చర్యల్లో తన జీవితాన్ని ప్రారంభించానని బండారు దత్తాత్రేయ గుర్తుచేశారు.

గవర్నర్  బండారు దత్తాత్రేయ జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 11/11

జనతా కీ కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated at - May 10 , 2025 | 07:23 AM