హైదరాబాద్లో మద్యం కల్తీ చేస్తున్న ముఠా అరెస్ట్
ABN, Publish Date - Apr 25 , 2025 | 02:08 PM
హైదరాబాద్లోని ఓ బార్లో మద్యం కల్తీ చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. అధిక ధరలు గల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, నీళ్లను కలుపుతూ బార్ సిబ్బంది ఎక్సైజ్ పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు.
1/9
హైదరాబాద్లోని ఓ బార్లో మద్యం కల్తీ చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.
2/9
అధిక ధరలు గల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, నీళ్లను కలుపుతూ బార్ సిబ్బంది ఎక్సైజ్ పోలీసులకు దొరికారు.
3/9
అయ్యప్ప సోసైటీలోని ట్రూప్స్ బార్లో ఈ దందా జరుగుతుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
4/9
రూ.1.48 లక్షల కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్కువ ధర మద్యం బాటిళ్లలో నీళ్లు, తక్కువ ధర మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.
5/9
బార్లో కల్తీతో నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
6/9
ఎక్సైజ్ సిబ్బందికి ఈ బార్పై అనుమానం రావడంతో రంగంలోకి దిగి తనిఖీలు చేశారు.
7/9
ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు.
8/9
ట్రూప్ బార్ లైసెన్స్ ఫీజ్ చెల్లించకపోవడం, మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకవడంతో ఎక్సైజ్ అధికారులకు అనుమానం రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు.
9/9
మద్యం కల్తీ చేస్తున్న ముఠాపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Updated at - Apr 25 , 2025 | 02:16 PM