Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..ఓటు వేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు
ABN, Publish Date - Nov 11 , 2025 | 11:53 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాసర్ స్కూల్లో ఏర్పాటు చేసిన 217 కేంద్రంలో నవీన్ యాదవ్ ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన కుటుంబ సభ్యులతో కలిసి నవోదయ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డి ఎల్లారెడ్డిగూడలో ఓటు వేశారు. దర్శకుడు రాజమౌళి దంపతులు షేక్పేట్లో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధురానగర్లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు సూచించారు.
1/11
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
2/11
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
3/11
ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
4/11
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాసర్ స్కూల్లో ఏర్పాటు చేసిన 217వ కేంద్రంలో నవీన్ యాదవ్ ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
5/11
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న నవీన్ యాదవ్.
6/11
ఓటు హక్కుని వినియోగించుకోవాలని పలువురు సూచించారు.
7/11
పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న మహిళలు.
8/11
పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి క్యూ లో నిలుచున్న ఓటర్లు.
9/11
ఓటు వేశానని చెబుతున్న మహిళలు.
10/11
పోలింగ్ కేంద్రంలో మహిళలు.
11/11
ఓటు వేయడానికి క్యూ కట్టిన ఓటర్లు.
Updated at - Nov 11 , 2025 | 11:58 AM