CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం

ABN, Publish Date - May 07 , 2025 | 02:33 PM

ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్, హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజల భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 1/9

ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 2/9

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్, హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్,ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 3/9

ఈ సమావేశంలో ప్రజల భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 4/9

భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 5/9

సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 6/9

దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టం చేశారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 7/9

అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 8/9

ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం 9/9

ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Updated at - May 08 , 2025 | 06:25 AM