CM Revanth Reddy: నవీన్ యాదవ్ గెలుపుపై సీఎం రేవంత్రెడ్డి ఏమన్నారంటే..
ABN, Publish Date - Nov 15 , 2025 | 07:26 AM
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని అఖండ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
1/11
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని అఖండ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
2/11
ఈ సందర్భంగా గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
3/11
టీపీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి ఆపలేదనే విషయాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్రెడ్డి.
4/11
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తలకు అంకితమని అభివర్ణించారు సీఎం రేవంత్రెడ్డి.
5/11
ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధిపై, ఇక్కడ పేదల సంక్షేమంపై తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు సీఎం రేవంత్రెడ్డి.
6/11
రెండేళ్లుగా నగరాభివృద్ధికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి తమ ఆలోచన, విజన్, కార్యచరణకు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు సీఎం రేవంత్రెడ్డి.
7/11
వచ్చే మూడేళ్లు ఆ దిశగా నిరంతరం పని చేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు తమకు సరికొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయని వివరించారు సీఎం రేవంత్రెడ్డి.
8/11
ఎన్నికలప్పుడే రాజకీయమని.. వచ్చే మూడేళ్లు అభివృద్ధి, పేదల సంక్షేమమే తమ మంత్రం అని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్రెడ్డి.
9/11
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక తమ బాధ్యత అని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు.
10/11
60 నుంచి 65 శాతం ఆదాయం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచే వస్తోందని తెలిపారు సీఎం రేవంత్రెడ్డి.
11/11
దశాబ్ద కాలంగా ప్రజల మధ్య కాంగ్రెస్ మనుగడ సాధిస్తోందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పోలైన ఓట్లలో 51 శాతం తమ పార్టీకి వచ్చాయని వెల్లడించారు.
Updated at - Nov 15 , 2025 | 07:26 AM