Bonalu 2025: అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Jul 13 , 2025 | 07:32 PM
ఆషాఢ మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
1/7
ఆషాఢం మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాలు పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లోని వివిధ దేవాలయాల్లో కొలువు అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తున్నారు.
2/7
ఆ క్రమంలో జులై 13వ తేదీ.. అంటే ఆదివారం కూకట్పల్లి జేఎన్టీయూ (హెచ్) ప్రాంగణంలోని అమ్మవారిని ఆ పరిసర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకున్నారు.
3/7
ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు మహిళలు బోనం సమర్పించారు.
4/7
అలాగే పోతురాజుల సైతం విన్యాసాలు చేశారు. అవి స్థానికులను ఆకట్టుకున్నాయి.
5/7
బోనం సమర్పించిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
6/7
అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వస్తున్న భక్తులు
7/7
అమ్మవారి దర్శనం కోసం దేవాలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు.
Updated at - Jul 13 , 2025 | 07:33 PM