Warangal: సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలివచ్చిన భక్తులు..
ABN, Publish Date - May 18 , 2025 | 08:06 PM
Saraswati Pushkaralu 2025: తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరం త్రివేణి సంగమానికి వివిధ రాష్ట్రాల నుంచి నాలుగో రోజున కూడా భక్తులు పోటెత్తారు.
1/5
తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
2/5
ఈ నెల 15వ తేదీన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలు ఆరంభమయ్యాయి. నాలుగో రోజున కూడా ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
3/5
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ పుష్కరాలు నిర్వహిస్తుంది.
4/5
వారాంతపు సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాళేశ్వరం పరిసరాలు వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
5/5
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వేలాది భక్తులు తరలివచ్చి కాళేశ్వర తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
Updated at - May 18 , 2025 | 08:15 PM