Peddagattu Jathara : అంగరంగ వైభవంగా పెద్దగట్టు జాతర
ABN, Publish Date - Feb 03 , 2025 | 07:10 AM
పెద్దగట్టు జాతరలో స్వామి వారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామి వారి సన్నిధిలో నిద్రించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకుంటూ, మళ్లీ రెండేళ్లకు వస్తామని బయలు దేరారు.
1/6
తెలంగాణలోనే అతి పెద్ద జాతర. పెద్దగట్టు లేదా గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర. రెండేళ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమికి మొదలై ఐదు రోజుల పాటు జాతర జరుగుతుంది.
2/6
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా అర్ధరాత్రి దిష్టి పూజ జరిగింది. కేసారం నుంచి పెద్దగట్టుకు శ్రాస్తోత్తంగా పూజలందుకుని భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా పెద్దగట్టుకు దేవర పెట్టె చేరింది.
3/6
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న దురాజుపల్లి గ్రామం ప్రక్కనే ‘పాలశేర్లయ్యగట్టు’ అనబడే గొల్లగట్టుపైన ఈ జాతర జరుగుతుంది. వెయ్యేండ్లుగా ఈ జాతర జరగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. శివుడినే లింగమంతుల స్వామిగాను, చౌడమ్మను శక్తి రూపిణిగాను భక్తులు కొలుస్తారు.
4/6
ఇక్కడ ఉండే ఉండ్రుగొండపైన రెండు గుడులను కట్టి శివునికి నైవేద్యంతోను, చౌడమ్మకు జంతు బలులతోను ఈ జాతరను నిర్వహించుకుంటారు. ఇప్పటికీ పెద్దగట్టు గిరిదుర్గంపై ఈ గుడులున్నాయి. అందుకే దీనిని ‘పెద్దగట్టు జాతర అని కూడా అంటారు.
5/6
అయితే కొన్ని కారణాల వల్ల నేటి పాలశేర్లయ్య గట్టుకు ఈ జాతరను మార్చారు. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
6/6
ఉదయం కాస్త తక్కువగా కనిపించినా, మధ్యాహ్నం ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. గజ్జెల లాగులు ధరించిన యాదవులు కటారి విన్యాసాలు చేస్తూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. మూగజీవాల బలి కొనసాగింది. మహిళలు గంపలను దేవతలకు సమర్పించారు.
Updated at - Feb 03 , 2025 | 07:22 AM