Nandamuri Balakrishna: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ
ABN, Publish Date - Sep 27 , 2025 | 02:33 PM
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఇవాళ (శనివారం) దర్శించుకున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారికి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. బాలకృష్ణకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
1/7
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఇవాళ (శనివారం) దర్శించుకున్నారు.
2/7
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారికి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.
3/7
బాలకృష్ణకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
4/7
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. అందరినీ ఒకేలా కరుణించే తల్లి దుర్గమ్మ తల్లి అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.
5/7
భక్తులకు దేవస్థానం అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని ప్రశంసించారు. దుర్గామాత ఈ ఏడాది 11 అవతారాలతో భక్తులపై కరుణ చూపుతోందని తెలిపారు బాలకృష్ణ.
6/7
ప్రతి అవతారంలోనూ భక్తులపై కరుణ చూపే మహా తల్లి దుర్గమ్మ తల్లి అని వెల్లడించారు.
7/7
ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) వీకే శీనా నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.
Updated at - Sep 27 , 2025 | 02:33 PM